Breaking News

ఐదో రోజూ పెట్రోల్‌ మంట

న్యూఢిల్లీ: దేశంలో వరుసగా ఐదో రోజు పెట్రోల్‌, డీజీల్‌ ధరలు పెరిగాయి. ఐదు రోజుల్లో పెట్రోల్‌ ధర రూ.2.74, డీజిల్ ధర రూ.2.83 మేర పెరిగింది. ఈనెల 7 నుంచి మొదలుపెట్టి ప్రతి రోజు ప్రభుత్వ చమురు కంపెనీలు ధరలు రివైజ్‌ చేస్తూనే ఉన్నాయి. దీంతో గురువారం పెట్రోల్‌ ధర లీటర్‌‌కు రూ.74 కాగా.. డీజిల్‌ ధర రూ.73.40కి చేరుకుంది.

ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

నగరంపెట్రోల్‌(రూ.)డీజిల్‌ (రూ.)
ఢిల్లీ74 72.22
ముంబై80.9870.92
చెన్నై77.9670.64
బెంగళూరు76.3968.66
హైదరాబాద్‌76.8270.59