![ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/COLLE-2.jpg?fit=677%2C304&ssl=1)
సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 20న నిర్వహించనున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక అర్హత పరీక్షల ఏర్పాట్లపై బుధవారం విజయవాడ నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఆర్ అండ్ ఆర్ డీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, సెక్రటరీ గిరిజాశంకర్ తదితరులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్, జిల్లా ఎస్పీలు, జడ్పీ సీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డాక్టర్ కె.ఫక్కీరప్ప, జడ్పీ సీఈవో వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు.