Breaking News

ఏపీలో సాగుకు పెద్దపీట

SPEAKER

సారథిన్యూస్​, శ్రీకాకుళం: వ్యవసాయానికి ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఏపీ స్పీకర్​ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తాండ్యాం గ్రామ సమీపంలోని రెల్లి గెడ్డపై రూ.26.42 కోట్లతో నిర్మించే ఎత్తిపోతల పథకానికి శాసన సభాపతి తమ్మినేని గురువారం శంకుస్దాపన చేశారు. ప్రతి గడపకు పరిపాలన చేరవేయడమే సీఎం జగన్​ ఆలోచన అన్నారు. తాండ్యాం ఎత్తిపోతల పథకాన్ని రూ.26.42 కోట్లతో నిర్మిస్తున్నామని చెప్పారు.

ఈ పథకం ద్వారా తాండ్యాం, పొందూరు, కృష్ణాపురం, మాల్కం గ్రామాలకు చెందిన 1933 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జే నివాస్, ఎమ్మెల్యే అప్పలరాజు, ఎపీఎస్ఐడీసీ కార్యనిర్వాహక ఇంజినీరు ఎం లక్ష్మీనారాయణ., సువ్యారి గాంధీ, పప్పల వెంకటరమణ, నాగారాజు, కొంచాడ రమణమూర్తి, లోలుగు శ్రీరాములు నాయుడు, గూన కృష్ణ తదితరులు పాల్గొన్నారు.