Breaking News

ఏపీలో అన్ని ఎంట్రెన్స్​లు వాయిదా

ఏపీలో అన్ని ఎంట్రెన్స్​లు వాయిదా

అమరావతి: ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఎంసెట్ స‌హా అన్ని ర‌కాల‌ ఎంట్రెన్స్​లను వాయిదా వేసింది. కరోనా సమయంలో సీఎం వైఎస్​జగన్​మోహన్​రెడ్డి సూచనలతో ఎంసెట్, ఐసెట్, ఈసెట్, లాసెట్, ఎడ్‌సెట్‌, పీజీ సెట్‌ల‌తో క‌లిపి మొత్తం 8 సెట్ల ఎగ్జామ్స్​ను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ‌ మంత్రి ఆదిమూల‌పు సురేష్​ సోమవారం ప్రకటించారు. దీనికి సంబంధించి త్వరలోనే పరీక్షల తేదీలను వెల్లడిస్తామని తెలిపారు. సెప్టెంబ‌ర్ మూడవ వారంలో ఎంసెట్ నిర్వహిస్తామని, దీనికి సంబంధించిన ప‌రీక్ష తేదీల‌ను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. డిగ్రీ, పీజీలో మొదటి, రెండో సంవత్సరం సంబంధించి సెమిస్టర్​ పరీక్షలు వాయుదా వేస్తున్నామ‌న్నారు‌. సెప్టెంబర్‌లో డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహిస్తామ‌ని మంత్రి పేర్కొన్నారు.