Breaking News

ఎన్జీ రామచంద్రన్ భార్యగా మధుబాల

ఎన్జీ రామచంద్రన్ భార్యగా మధుబాల

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న ‘తలైవి’ చిత్రంలో మణిరత్నం ‘రోజా’ హీరోయిన్ మధుబాల ఓ ఆసక్తికర రోల్ పోషిస్తున్నాడు. విష్ణు ఇందూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తమిళనాడు మాజీ సీఎం, దివంగత నేత జయలలిత బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో క్యారెక్టర్ల ఎంపిక కూడా చాలా పకడ్బందీగానే చేస్తున్నారు. కథకు ముఖ్యమైన ఎన్జీ రామచంద్రన్ పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నారు. జయలలితకు ఆయన వెల్ విషర్, గాడ్ ఫాదర్, రాజకీయ గురువు అన్నీ తానే అయ్యారు. ఆ పాత్రను అరవింద్ చేస్తుండగా ఆయన సతీమణి పాత్రకు మధుబాలను ఎంపిక చేశారట. రీసెంట్​గా ఆమె క్యారెక్టర్ నటిగా టాలీవుడ్​లో రీఎంట్రీ ఇచ్చారు.

ఇప్పుడి చిత్రంలో జానకీ రామచంద్రన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. ‘జయలలిత గారిని కలిసే అవకాశం దక్కింది కానీ నేను జానకి గారిని కలవలేకపోయాను.. తనకు సంబంధించిన పాత క్లిప్పులను చూసి ఆమె ప్రవర్తన తెలుసుకోవాలి.. ఆమె చాలా సెన్సిటివ్ అని విన్నాను. సొంత హావాభావాలతో నటించడం పెద్ద కష్టమేమీ కాదు.. కానీ ఒకరిని అనుకరించాలంటే చాలా హార్డ్ వర్క్ అవసరం. వారి ప్రతి కదలికను పట్టుకోగలగాలి.. వీటి కోసం చాలా పర్ఫక్షన్ అవసరం..”అంటూ తన క్యారెక్టర్ గురించి ఎంత కష్టపడాలో వివరించింది. అంతేకాదు సెట్స్ నుంచి కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ ‘ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉండొచ్చు.. కానీ ఫిల్మ్ సెట్స్ లో మాత్రం ఎంతో ఓపికతో కూడిన అద్భుత చిత్రాలు కనిపిస్తాయి’ అన్న క్యాప్షన్ కూడా జతచేశారు. ఈ బహుభాషా బయోపిక్ 2020లోనే విడుదలకు సిద్ధమవుతోంది.