Breaking News

ఉసా మరణం తీరనిలోటు

ఉసా మరణం తీరనిలోటు

సారథిన్యూస్​, ఖమ్మం: బహుజన ఉద్యమకారుడు ఉ. సాంబశివరావు మరణం తీరని లోటని టీజేఏసీ ఖమ్మం జిల్లా కన్వీనర్​ కేవీ కృష్ణారావు పేర్కొన్నారు. శనివారం ఖమ్మం పట్టణంలోని ఆర్​అండ్​బీ గెస్ట్​హౌస్​ ఎదుట ఉసా చిత్రపటానికి నివాళి అర్పించారు. సామాజిక ఉద్యమాలను నిర్మించడంలో ఉసా పాత్ర మరువలేనిదని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐఎం​ఎల్​ న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా నాయకులు అశోక్ ఝాన్సీ, ప్రజా సంఘాల నాయకులు బీవీ రాఘవులు, లిక్కి కృష్ణరావు, పాల్వంచ రామారావు, హనుమతురావు దాసరి శ్రీనివాస్, నరేందర్, మధు గౌడ్, గంటా భీమయ్య, లింగారాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.