Breaking News

ఈజ్ ఆఫ్​ డూయింగ్ బిజినెస్ కు సంస్కరణలు

ఈజ్ ఆఫ్​డూయింగ్ బిజినెస్ కు మరిన్ని సంస్కరణలు

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో ఈజ్​ఆఫ్ డూయింగ్​బిజినెస్​కు మరిన్ని సంస్కరణలు తీసుకురాబోతున్నట్లు మంత్రి కేటీఆర్​ప్రకటించారు. బుధవారం హైదరాబాద్​లోని జలమండలిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​తో కలిసి సమీక్షించారు. న్యాయ, టూరిజం, ఫిలిం డెవలప్​మెంట్​ కార్పొరేషన్ సివిల్ సప్లయీస్, ఎక్సైజ్ డిపార్ట్​మెంట్, సీసీఎల్ఏ వంటి పలు శాఖలపై వివరాలు అందజేసి చేపట్టాల్సిన సంస్కరణలపై ఆయా సెక్రటరీల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. టీఎస్ బీపాస్ సౌకర్యవంతంగా, సులభంగా, పారదర్శకంగా ఉందన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ సెక్రటరీ జయేశ్​ రంజన్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.