![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/short-news-new-e1594233968806.jpg?fit=150%2C68&ssl=1)
సారథిన్యూస్, చొప్పదండి: రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న వేళ కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మున్సిపల్ సిబ్బందికి రోగనిరోధక శక్తి పెంపొందించే హోమియోపతి మాత్రలను పంపిణీ చేశారు. ఈ మందులతో రోగనిరోధక శక్తి పెరిగి.. కరోనా వచ్చే అవకాశం తగ్గుతుందని ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో హోమియోపతి డాక్టర్ అశోక్, సైకాలజిస్ట్ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ విజయ లక్ష్మి, సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి , మాజీ జెడ్పీటీసీ సంబన్న, ఎండీ జహీర్ తదితరులు పాల్గొన్నారు.