Breaking News

ఇది నిజమేనా..?

ఇది నిజమేనా..?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్యాన్ ఇండియా మూవీ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ‘భారతీయుడు 2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక బ్రేక్ వస్తూనే ఉంది. ఆ మధ్య సెట్​లో ఓ పెద్దక్రేన్ షూటింగ్ సెట్ పై పడి ఘోర ప్రమాదమే జరిగింది. తర్వాత లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిపివేయక తప్పలేదు.

షూటింగ్ లేట్ అవ్వడంతో ఈ సినిమాలో కీలకపాత్ర చేయనున్న ఓ యువనటి తప్పుకుందని, అందుకోసం మరో హీరోయిన్ ను తీసుకున్నారని సమాచారం. ఆమె ఎవరో కాదు..‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో తెలుగు వారికి బాగా పరిచయమైన హీరోయిన్ శృతిశర్మ. తర్వాతి షెడ్యూల్ నుంచి శృతిశర్మ కూడా షూటింగ్​కు అటెండ్ కానుందని అంటున్నారు. అయితే ఈ సినిమాలో శృతి ఏ క్యారెక్టర్ చేయనుందన్న విషయంలో క్లారిటీ రాలేదు. అసలీ వార్త కూడా నిజమేనా అన్నది తెలియడానికి ఇంకాస్త టైమ్ పట్టేలా ఉంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్, భారీ క్యాస్టింగ్​తో సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్​రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.