Breaking News

ఇంపార్టెన్స్ రోల్స్ తో

ఇంపార్టెన్స్ రోల్స్ తో

తెలుగు, తమిళ భాషల్లో సమానంగా సినిమాలు చేస్తూ తన కెరీర్ ని బ్యాలెన్స్ చేసుకుంటోంది నివేదా పేతురాజ్. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఓ బిగ్ హిట్ ను తన ఖాతాలో జమచేసుకుంది. రామ్ కు జంటగా తాను నటించిన ‘రెడ్’ విడుదలకు రెడీగా ఉంది. తాజాగా మరో మూవీ తన ఖాతాలో యాడ్ అయింది. రానా, సాయిపల్లవి జంటగా రూపొందుతున్న ‘విరాటపర్వం’లో కీలకపాత్ర పోషిస్తోంది నివేదా. జ‌రీనా వ‌హాబ్‌, నందితాదాస్, ప్రియ‌మ‌ణి, ఈశ్వరీ రావ్‌ ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు తమిళంలోనూ తను నటించిన రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ నటించనున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ లోనూ నివేదా పేతురాజ్ పేరు వినిపిస్తోంది. మొత్తానికి మెయిన్ లీడ్ గానే నటిస్తాను అని కాకుండా, ఇంపార్టెంట్ రోల్స్ తోనూ ఆకట్టుకుంటోంది నివేదా.