Breaking News

ఇంటింటికీ ఇంటర్​నెట్​

ఇంటింటికీ ఇంటర్​నెట్​

సారథి న్యూస్, కరీంనగర్: తెలంగాణలో ప్రతి ఇంటికీ ఇంటర్​నెట్ సేవలు కల్పిస్తామని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేటలో 307 మంది గిరిజన రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో టీ -ఫైబర్ పనులు కొనసాగుతున్నాయన్నారు. వచ్చే నాలుగేళ్లలో ఎలాంటి ఎన్నికలు లేవని, అభివృద్ధిపైనే దృష్టి సారిస్తామని తెలిపారు. కృష్ణా, గోదావరి నదుల్లో న్యాయమైన వాటాను కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల ద్వారా వాడుకుంటున్నామన్నారు. రైతులకు దీర్ఘకాల మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వ్యవసాయాన్ని పండగ చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని వ్యాఖ్యానించారు. కరోనా కష్టసమయంలో సైతం రైతుబంధు అందజేశామన్నారు. ‘ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు’అని గట్టిగా నమ్మే వ్యక్తి కేసీఆర్‌ అని మంత్రి వ్యాఖ్యానించారు.