![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/RRRFFF.jpg?fit=299%2C168&ssl=1)
తారక్, రామ్చరణ్తో జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రానికి తాజాగా పోలీసుల నుంచి అనుమతి దక్కలేదు. కరోనా లాక్డౌన్తో గత రెండునెలలుగా చిత్రీకరణ ఆగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వాలు షూటింగ్కు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, చరణ్ల స్థానంలో డూప్స్ను పెట్టి ప్రభుత్వ విధి విధానాలకు లోబడి టెస్ట్ షూట్ చేయాలనుకున్నారు. అంతా సిద్ధమైంది కానీ పోలీసుల నుంచి అనుమతులు రాలేదు. దీంతో రాజమౌలి అనుమతి కోసం వేచి చూస్తున్నారు. రెండు, మూడ్రోజుల్లో అనుమతులు వచ్చే అవకాశం ఉందని టాక్.