Breaking News

ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య

సారథి న్యూస్, రామాయంపేట: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్​ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంటలో చోటుచేసుకున్నది. కల్వకుంటకు చెందిన బుర్రని బాలమల్లు (45) రెండెకరాలు కౌలుకు తీసుకొని వరిసాగు చేశాడు. ఇందుకోసం కొంత అప్పుచేశాడు. అయితే ఇటీవల కరిసిన భారీ వర్షాలకు పంట మునిగిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెంది శనివారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన బాలమల్లుకు భార్య ఇందిర తీవ్రంగా విలపిస్తున్నది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ప్రకాష్ గౌడ్ తెలిపారు.