Breaking News

‘ఆరమ్’ సీక్వెల్ ఉంది..

‘ఆరమ్’ సీక్వెల్ ఉంది..


నీళ్లు లేక, పంటలు పండక బీడుగా మారిన భూమల్లో వ్యవసాయం చెయ్యలేక రైతులు మేస్త్రీలుగా, వలస కూలీలుగా మారి కుటుంబాలను వెళ్లదీస్తూ ఉంటారు. ఇంతలో నీళ్ల కోసం వేసిన బోరులో ఓ చిన్నారి పడిపోతుంది. పాపను రక్షించేందుకు ఆ జిల్లా కలెక్టర్ను సంప్రదిస్తారు అక్కడి ప్రజలు. పొలిటికల్ ఒడిదుడికుడులను తట్టుకొని ఆ కలెక్టర్ ఆ చిన్నారిని ఎలా రక్షించడమే కాదు ఊరిని కూడా బాగు చేసేందుకు సిద్ధపడుతుంది ఆ లేడీ కలెక్టర్. కలెక్టర్ గా నయనతార నటించగా సోషియో పొలిటికల్ థ్రిల్లర్​గా ‘ఆరమ్’ సినిమాను 2017లో తమిళంలో గోపి నైనర్ తెరకెక్కించాడు. అయితే గతంలో ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని నిర్మాత కె.రాజేష్ ప్రకటించారు.

సీక్వెల్ మరింత పటిష్టమైన స్క్రిప్టుతో, సామాజిక సందేశంలో ‘ఆరమ్ 2’ ఉండనుందని స్పష్టం చేశారు కూడా. అయితే దాదాపు రెండేళ్లు గడుస్తున్నా ఈ సినిమా ప్రస్తావన గురించి లేకపోవడంతో దీని సీక్వెల్ ఉండదేమో అని అనుకున్నారంతా. కానీ రీసెంట్​ గా ఈ వార్త మళ్లీ వెలుగులోకి వచ్చింది. ‘ఆరమ్’ సీక్వెల్ ఉంటుంది కానీ, హీరోయిన్ నయన్ కాదు అంటూ వదంతులు వచ్చాయి. నయన్కు డేట్స్ అడ్జస్ట్ అవ్వక ఆమె ప్లేస్లో కీర్తి సురేష్ ను తీసుకుంటున్నారన్న వార్త కోలీవుడ్​ లో చక్కర్లు కొట్టింది. తాజాగా ‘ఆరమ్ 2’ చిత్రం కోసం కీర్తి సురేష్ను అసలు సంప్రదించలేదంటూ ఈ పుకార్లపై దర్శకుడు గోపి క్లారిటీ ఇచ్చేసాడు. అంతేకాదు.. ‘‘ సీక్వెల్ ఉంటుంది. నయన్తో అయితేనే ఆ సినిమా చేస్తాను. మరొకరితో ఆ సినిమా చేసే ప్రసక్తే లేదు.. వదంతులు నమ్మొద్దు.. ఈ రూమర్లు చూసి నేను కాస్త బాదపడ్డాను కూడా” అని నిర్మొహమాటంగానే అంటూ కరోనా పరిస్థితులు చక్కబడేంత వరకూ ఈ సినిమా గురించి మాట్లాడనని స్పష్టంగా తేల్చి చెప్పేశాడు గోపి.