![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/TEACHERRRFF.jpg?fit=700%2C310&ssl=1)
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఆంగ్ల అధ్యాపకుడిగా పనిచేస్తున్న అజ్మీర రాజు కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. కాగా శనివారం ఆయనకు హైదరాబాద్లోని ఓ హాస్పిటల్లో ఆపరేషన్ నిర్వహించారు. దీంతో ఆపరేషన్ వికటించి ప్రాణాలు కోల్పోయాడు. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని అజ్మీరా తండాకు చెందిన రాజు.. 15 ఏళ్లుగా పెద్దశంకరంపేటలో పార్ట్టైమ్ లెక్చరర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రాజు మృతికి ప్రిన్సిపాల్ అవనీష్ రెడ్డి, అధ్యాపకులు మల్లేశం, అనంత రాజ్ శర్మ, నాగరాజు, శ్రీశైలం నివాళి అర్పించారు.