Breaking News

ఆధునిక టెక్నాలజీతో అద్భుతాలు

సారథి న్యూస్​, రామగుండం: ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి అన్నిరంగాల్లోనూ అద్భుతాలు సాధించవచ్చని సింగరేణి డైరెక్టర్​ (ఆపరేషన్స్​) చంద్రశేఖర్​ పేర్కొన్నారు. సోమవారం మల్లారెడ్డి కాలేజ్​ ఆఫ్​ ఇంజినీరింగ్​ ఆధ్వర్యంలో ఓ జాతీయ సదస్సును వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా నిర్వహించారు. మైనింగ్​ ఇంజినీరింగ్​ నిపుణులు, వివిధ శాఖల అధికారులు ఈ సదస్సులో పాల్లొన్నారు. వారంపాటు ఈ వీడియో కాన్ఫరెన్స్​ కొనసాగనున్నది. కార్యక్రమంలో మైనింగ్​ సేఫ్టీ (సౌత్​ సెంట్రల్​ జోన్​) డిప్యూటీ డైరెక్టర్​ మలయ్​ టికేదార్​, డిప్యూటీ డెరెక్టర్​ ఆఫ్​ మైన్​ సేఫ్టీ మహ్మద్ నియాజీ, మల్లారెడ్డి కళాశాల ప్రిన్సిపాల్​ డాక్టర్ ఏ రవీంద్ర, కో​​​ ఆర్డినేటర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంఎస్ వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు.