Breaking News

ఆదిలాబాద్​పై వివక్ష

సారథి న్యూస్ ఆదిలాబాద్: సీఎం కేసీఆర్​ ఆదిలాబాద్ జిల్లాపై కక్ష గట్టారని.. అభివృద్ధికి నిధులు కేటాయించకుండా వివక్ష ప్రదర్శిస్తున్నారని ఎంపీ సోయం బాపూరావు ఆరోపించారు. మంగళవారం ఆయన బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్​తో కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్​ పనులను పరిశీలించారు. వెనుకబడిన అదిలాబాద్ జిల్లాలో పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కార్డియాలజీ, న్యూరాలజితోపాటు తొమ్మిది విభాగాలతో కూడిన ఆధునిక హంగులతో ఆస్పత్రి భవనానికి 150 కోట్లు కేంద్రం మంజూరు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 30 కోట్లు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాంపల్లి వేణుగోపాల్, కౌన్సిలర్లు ఆకుల ప్రవీణ్, లాలా మున్న, జోగు రవి, ఏండ్రాల నగేశ్​, దినేశ్​, మాటొలియా, లోక ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.