Breaking News

ఆకట్టుకున్న గేల్.. పంజాబ్ ​గెలుపు

ఆకట్టుకున్న గేల్.. పంజాబ్​గెలుపు

షార్జా: ఐపీఎల్‌ 13 సీజన్‌లో భాగంగా 31వ మ్యాచ్​లో కింగ్స్‌ ఎలెవన్ ​పంజాబ్‌ మరో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్‌ను మంచి ఆటతో గేల్‌ ఆకట్టుకున్నాడు. ముందుగా టాస్​ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన ఆర్సీబీ 172 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. అరోన్‌ ఫించ్‌(20), దేవదూత్‌ పడిక్కల్‌(18) నిరాశపరిచారు. మురుగన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో ఫించ్‌ ఔట్‌ కాగా, అర్షదీప్‌ బౌలింగ్‌లో పడిక్కల్‌ పెవిలియన్‌ చేరాడు. కోహ్లి(48; 39 బంతుల్లో 3 ఫోర్లు) జట్టు స్కోరును నడిపించాడు. శివం దూబే(23; 19 బంతుల్లో 2 సిక్స్‌) మెరుపులు మెరిపించాడు. ఏబీ డివిలియర్స్‌(2) ఘోరంగా విఫలమయ్యాడు. క్రిస్‌ మోరిస్‌(25 నాటౌట్‌; 8 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు) బ్యాట్‌ ఝుళిపించాడు. ఆర్సీబీ ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. మిగతా ఆర్సీబీ ఆటగాళ్లలో వాషింగ్టన్‌ సుందర్‌(13), ఉదాన(10 నాటౌట్‌; 1సిక్స్‌)లు ఫర్వాలేదనిపించారు. పంజాబ్‌ బౌలర్లలో మహ్మద్‌ షమీ, మురుగన్‌ అశ్విన్‌లు రెండు వికెట్లు చొప్పున తీశారు.. అర్షదీప్‌ సింగ్‌, క్రిస్‌ జోర్డాన్​ ఒక్కో వికెట్​చొప్పున తీశారు.

లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన పంజాబ్..​స్టార్​ప్లేయర్​ గేల్‌ తన మార్క్​ ఆటను చూపించాడు. 45 బంతుల్లో ఫోర్‌, 5 సిక్స్‌లతో 53 పరుగులు సాధించాడు. కేఎల్‌ రాహుల్‌(61 నాటౌట్‌; 49 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్స్‌లు) రాణించడంతో పంజాబ్‌ విజయం సాధించింది. జట్టులో మయాంక్‌ అగర్వాల్‌(45; 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మంచి ఆరంభాన్నిచ్చాడు. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 177 పరుగులతో విజయం సాధించారు. ఇక ఆర్సీబీ బౌలర్లలో చాహల్​మూడు ఓవర్లు వేసి ఒక వికెట్​మాత్రమే తీయగలిగాడు.