Breaking News

అలా అయితేనే చేస్తా..

అలా అయితేనే చేస్తా..


సినిమాలతో పాటు సోషల్ మీడియాకి ఎప్పుడూ టచ్​లో నే ఉంటుంది ఈ కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. టాలీవుడ్​లో టాప్ హీరోయిన్​గా చలామణీ అవుతున్న రష్మిక మందన్న ఏదైనా సినిమాకి సైన్ చేసే ముందు చాలా ఆలోచిస్తుందట. ఆ విషయాన్ని తన అభిమానితో చాట్ చేస్తున్నప్పుడు బైట పెట్టింది. ప్రస్తుతం లాక్ డౌన్ సందర్భంగా షూటింగ్స్ ఇంకా సెట్స్ పైకి రాలేదు. ఈ గ్యాప్​లో రష్మిక తన ముచ్చట్లను అభిమానులతో పంచుకుంటోంది. ‘నేను ఏదైనా సినిమాలో నటించాలంటే నా పాత్రకు ఎమోషన్ డెప్త్ కచ్చితంగా ఉండాలి.. అలాగే ఫుల్ లెంగ్త్ ఎంటర్ టెయిన్ మెంట్ అందించే విధంగా కూడా ఉండాలి. కథలో నా పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే ఆ సినిమా చేయడానికి కమిటవుతా..’ అంటున్న ఈ బ్యూటీ తన మొదటి సినిమా ‘కిరాక్ పార్టీ’ నుంచి ఇదే పద్ధతి పాటిస్తోందట. ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ పక్కా మాస్ ఎంటర్ టైనర్​ గా రూపొందిస్తున్న ‘పుష్ప’ చిత్రంలో బన్నీతో జోడీ కడుతోంది. ఈ మూవీలో చిత్తూరి యాస మాట్లాడుతూ పల్లెటూరి అమ్మాయిలా అభిమానులను అలరించనుందని టాక్.