Breaking News

అమ్మో.. మిడతల దండు

  • అనంత, విశాఖ జిల్లాల్లో కలకలం

సారథి న్యూస్​, అనంతపురం: మిడతల దండు రైతులను కలవరవపెడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాయదుర్గంలో రెండు రోజుల క్రితం ఓ మిడతల దండు కనిపించింది. అలాగే విశాఖపట్నం జిల్లా కశింకోట మండలంలో కూడా పంటలపై ఈ దండు వాలింది. అలాగే చిత్తూరు జిల్లాలో కూడా వివిధ పంటలపై దాడిచేస్తోంది. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం చాపర గ్రామంలో జిల్లేడు చెట్లపై మిడతల గుంపు వాలింది. వాటి సంచారంపై స్థానికులు, రైతులు అగ్రికల్చర్​ అధికారులకు సమాచారమిచ్చారు.

ఖరీఫ్‌ పంటలపై మిడతల దాడి ప్రమాదకరంగా మారనుందని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జూన్‌, జూలై మాసాల్లో మిడతల ప్రభావం మరింతగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు ప్రభుత్వమే పురుగు మందులను విమానాల ద్వారా స్ప్రే చేయించాలని భారత్‌ త్రిషక్‌ సమాజ్‌ కేంద్రానికి సూచించింది. ఈ ఏడాది మిడతల సమూహదాడిని నియంత్రించే శక్తి రాష్ట్రాలకు లేదని కేంద్రమే ఈ బాధ్యత చేపట్టాలని పేర్కొంది.