Breaking News

అమ్మా.. లే అమ్మా

  • తల్లిని లేపేందుకు యత్నించిన రెండేళ్ల కొడుకు

పాట్నా: తల్లి లేదని, ఇక తిరిగి రాదని తెలియని ఆ పసిప్రాణం అమ్మను లేపేందుకు ప్రయత్నించి అలసిపోయింది. తల్లి చనిపోయిందని తెలియని వయసులో నవ్వుతూ ప్లాట్‌ఫాం మొత్తం తిరిగి ఆడుకున్నాడు ఆ బుడ్డోడు. బీహార్‌‌లోని ముజ్‌ఫర్‌‌పూర్‌‌ రైల్వే స్టేషన్‌లో తీసిన ఒక వీడియో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. వలస కార్మికురాలు తిండి లేక, ఎండదెబ్బతో చనిపోతే తల్లి చనిపోయిందని తెలియని ఆ రెండేళ్ల పిల్లాడు శవం పక్కనే కూర్చొని ఆడుకున్నంటున్న ఘటన అందరి హృదయాలను కలిచివేసింది.

తల్లిని లేపేందుకు యత్నించిన రెండేళ్ల కొడుకు

శవంపై కప్పిన దుప్పటిని తీసి ఆమెను లేపేందుకు ప్రయత్నించిన పిల్లాడ్ని చూసి అక్కడి వారంతా కన్నీరు పెట్టుకున్నారు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ముజ్‌ఫర్‌‌నగర్‌‌కు చెందిన ఒక మహిళ పనుల కోసం గుజరాత్‌ వలస వెళ్లింది. లాక్‌ డౌన్‌ కారణంగా పనులు లేకపోవడంతో శ్రామిక్‌ రైలులో ముజఫర్‌పూర్​కు బయలుదేరింది. కాగా.. ట్రైన్‌లో తినేందుకు తిండి లేక, ఎండ దెబ్బకు కుప్పకూలిపోయింది. రేలు ముజఫర్‌పూర్‌‌కు చేరుకోగానే చూసిన వారు ఆమె శవాన్ని ప్లాట్‌ఫాంపై పడుకోబెట్టారు. మహిళతో రెండేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.