![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/ktr-2-f-1.jpg?fit=200%2C110&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: కుత్బుల్లాపూర్ నియోజవర్గం పరిధిలోని 8 డివిజన్లలో తాగునీటి సరఫరా పైప్ లైన్లు, భూగర్భ డ్రైనేజీ అభివృద్ధి పనులకు రూ.41కోట్లు మంజూరు చేయాలని కోరుతూ బుధవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభిపూర్రాజు ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధికి కృషిచేస్తానని మంత్రి హామీ ఇచ్చారని వారు తెలిపారు.