![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/KAMMAM-AJAY-PUVVADA.jpg?fit=1173%2C537&ssl=1)
సారథిన్యూస్, కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలురుపాడు మండలం పాపకొల్లులో శుక్రవారం ఆయన విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. దుమ్ముగూడెం మండలం మహాదేవపురం గ్రామంలో రూ. 2.83 కోట్లతో నూతనంగా నిర్మించిన 45 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించడంతోపాటు.. రూ. 22 లక్షలతో నిర్మించనున్న రైతు బంధు వేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నర్సాపురం (కే మారేడుబాక) గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఉప కేంద్రం మరియు అంగన్ వాడీ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ మలోత్ కవిత, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే రాములు నాయక్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే పొదెం వీరయ్య, కలెక్టర్ ఎంవీ రెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.