![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/raj-final.jpg?fit=200%2C150&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: అత్యధునిక హంగులతో యుద్ధప్రాతిపదికన గచ్చిబౌలిలో టిమ్స్ దవాఖానను ఏర్పాటు చేశామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బుధవారం ఆయన హాస్పిటల్ను సందర్శించారు. ఇక్కడ వెయ్యి బెడ్లకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించామని, మరో మూడు నాలుగు రోజుల్లో దవాఖానా ప్రారంభమవుతుందన్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టి డాక్టర్లు వైద్యం చేస్తున్నారని, అలాంటి వారిపై దాడులు చేయడం సరికాదన్నారు. జిల్లా స్థాయి ఆస్పత్రుల్లోనూ ఐసీయూ, వెంటిలేటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. గాంధీ ఆస్పత్రి పూర్తిగా కోవిడ్ హాస్పిటల్ గా మారిందన్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారు వెంటనే హాస్పిటల్కు రావాలన్నారు. చాటుమాటున పరీక్షలు చేయించుకోవద్దన్నారు.