Breaking News

అంబేద్కర్​ బాటలో నడుద్దాం

సారథిన్యూస్​, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని గ్రామంలోని ట్రైబల్ వెల్ఫేర్​ కళాశాలలో మంగళవారం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అంబేద్కర్​ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మనమంతా అంబేద్కర్​ చూపిన దారిలో పయనించాలని పిలుపునిచ్చారు. అనంతరం మంత్రి కిన్నెరసాని ప్రాజెక్టును సందర్శించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా టీఆర్​ఎస్​ నేత వనమా రాఘవేంద్రరావు, డీసీఎంఎస్​ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, జెడ్పీటీసీ వాసుదేవరావు, టీఆర్​ఎస్​ నేతలు కనకేశ్, రాజుగౌడ్, ప్రకాశ్, నాగేశ్వరరావు, భాస్కర్, చిన్నవెంకటేశ్వరరావు, ముత్తయ్య, లక్ష్మణ్, సోమయ్య, నరేందర్ రెడ్డి, నాగరాజు, హర్ష, ఫరీద్​ తదితరులు పాల్గొన్నారు.