![అందరికీ కరోనా టెస్టులు చేయాలి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/VJ-2F.jpg?fit=680%2C254&ssl=1)
సారథి న్యూస్, వాజేడు(ములుగు): అందరికీ కరోనా టెస్టులు చేయాలని టీఏజీఎస్ అధ్యక్షుడు దబ్బకట్ల లక్ష్మయ్య ఆధ్వర్యంలో ములుగు జిల్లా వాజేడు తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. అన్ని ఆస్పత్రుల్లో కరోనాకు వైద్యం చేయాలని డిమాండ్చేశారు. ప్రతి పేద కుటుంబానికి రూ.7,500 ఇవ్వాలని కోరారు. ప్రతి రేషన్కార్డుదారుడికి 10 కేజీల బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి పనిదినాలు రెండొందల రోజులకు పెంచాలన్నారు. రోజుకు రూ.600 వేతనం ఇస్తూ.. ఫీల్డ్ అసిస్టెంట్లతో పనులు చేయించాలన్నారు. మధ్యాహ్న భోజనం ఇంటివద్దకే పంపించాలని, పోడుసాగుదారులపై అధికారుల వేధింపులు ఆపి, హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్చేశారు.