![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/CARONA-PANJABBB.jpg?fit=301%2C167&ssl=1)
సారథి న్యూస్ ఆదిలాబాద్: కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఆదిలాబాద్లో ప్రస్తుతం కరోనా కేసులు పేరుగుతున్నాయి. జిల్లాలో రోజుకు పదుల సంఖ్యలో కేసులు వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఓఎస్డీ, కలెక్టర్ క్యాంప్ క్లర్క్లకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు జిల్లా వైద్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పనిచేస్తున్న మిగిలిన సిబ్బందికి అందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు శుక్రవారం వీరంతా శాంపిల్స్ ఇచ్చారు. కాగా ఇటీవల కలెక్టర్రేట్కు వచ్చినవారిలో ఆందోళన నెలకొన్నది.