Breaking News

హోంక్వారంటైన్ లోకి ​జార్ఖండ్​ సీఎం

రాంచీ: జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఆ రాష్ట్ర మంత్రి మిథిలేశ్​ ఠాకూర్​, పార్టీ ఎమ్మెల్యే మథుర మహకు కరోనా పాజిటివ్​ రావడంతో సోరెన్​ ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగానే తాను స్వీయనిర్బంధంలోకి వెళుతున్నానని హేమంత్​ సోరెన్​ ట్వీట్​ చేశారు. తన కార్యాలయంలో పనిచేసే సిబ్బంది, అధికారులు హోంక్వారంటైన్​కు వెళ్లాలని ఆయన కోరారు. తాను ఇంటినుంచే ముఖ్యమైన పనులు నిర్వహిస్తానని చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గం‍టల్లో అత్యధికంగా 22,752 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి బారినపడి ఒక్కరోజే 482 మంది మరణించారు.