![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/rajinder.jpg?fit=330%2C292&ssl=1)
న్యూఢిల్లీ: వయసు సంబంధించిన అనారోగ్య సమస్యలతో దేశవాళీ క్రికెట్ దిగ్గజ స్పిన్నర్ రాజిందర్ గోయల్ (77) కన్నుమూశారు. ఆయనకు భార్య, ఓ కొడుకు ఉన్నాడు. 157 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ 750 వికెట్లు తీశారు. హర్యానా, నార్త్జోన్కు ప్రాతినిధ్యం వహించారు. ఆట పరంగా అత్యుత్తమ స్పిన్నరే అయినా.. బిషన్ సింగ్ బేడీ నీడలో ఆయనకు టీమిండియాకు ఆడే అవకాశం దక్కలేదు. బీసీసీఐ జీవితకాల సాఫల్య పురస్కారంతో పాటు అనేక అవార్డులను సొంతం చేసుకున్నాడు. 1974–75లో వెస్టిండిస్తో జరిగిన సీరిస్కు రాజిందర్ ఎంపికైనా.. 12వ ఆటడిగా ఉండటంతో మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. దీంతో ఈ సిరీస్ కోసం కొత్తగా కొనుక్కున్న బూట్లు, కిట్ను అలాగే వదిలేశాడు. కానీ కాలక్రమంలో బేడీ టీమ్లోకి రావడంతో రాజిందర్.. భారత్కు ఆడే అవకాశాన్ని సంపాదించలేకపోయాడు.