Breaking News

సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి స్థలపరిశీలన

సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి స్థలపరిశీలన

సారథి న్యూస్, నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాలలో నూతనంగా ఏర్పాటు చేయబోయే మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి అవసరమయ్యే స్థలాన్ని నంద్యాల నూనెపల్లి వద్ద ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్ప రవిచంద్రకిషోర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి శుక్రవారం పరిశీలించారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వారు అన్నారు. ఆరోగ్యం అనేది పేదవాడికి, సామాన్యుడికి ఒక హక్కు మాదిరిగా ఉండాలనే దిశగా బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. సీఎం వైఎస్ ​జగన్ ​ఆదేశాల మేరకు స్థలాన్ని పరిశీలించినట్లు చెప్పారు.