![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/SCHOOL-GIRLSFF.jpg?fit=295%2C171&ssl=1)
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. ఆ రాష్ట్రంలోని 1 నుంచి 12 వ తరగతి వరకు 25 శాతం వరకు సిలబస్ను తగ్గించనున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎంఎస్సీఈఆర్టీ) ఆమోదం తెలిపింది. 2020-21 విద్యాసంవత్సరంలో సిలబస్ కోతను విధించనున్నట్టు ఆ రాష్ట్ర మంత్రి వర్షా గైక్వాడ్ తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కాగా ఇప్పటికే 9 నుంచి 12 వ తరగతి విద్యార్థులకు సిలబస్లో 30 శాతం కోత విధిస్తున్నట్టు సీబీఎస్ఈ ప్రకటించింది.