![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/talasa-3.jpg?fit=547%2C258&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: వందేళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు త్వరలోనే కొత్త అందాలను సంతరించుకుంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గురువారం రైల్వే స్టేషన్ ఎదుట రూ.30కోట్ల వ్యయంతో నిర్మింనున్న ఫుట్ పాత్ లు, బస్ షెల్టర్లు, రోడ్ల పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఏడాదిలోగా అన్ని పనులను పూర్తిచేయనున్నట్లు తెలిపారు.