Breaking News

సర్పంచ్​పై అట్రాసిటీ కేసు

సారథి న్యూస్, హుస్నాబాద్: తోటి ప్రజాప్రతినిధిని కులం పేరుతో దూషించిన ఓ సర్పంచ్​పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కరీంనగర్​ జిల్లా అక్కన్నపేట మండలం గండిపల్లి గ్రామంలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీటీసీ బానోతు ప్రమీళ హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్​ సృజనకు ఎంపీటీసీకి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన సర్పంచ్​.. ఎంపీటీసీని కులం పేరుతో దూషించింది. సర్పంచ్​తోపాటు ఆమె భర్త వంగపల్లి సంపత్​కుమార్​, అత్త అచ్చవ్వ, ఉప సర్పంచ్​ భర్త గుళ్ల సంపత్​, కూడా ఆమెను కులంపేరుతో దూషించారు. దీంతో సర్పంచ్​ పోలీసులకు ఫిర్యాదుచేశారు. సర్పంచిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై కొత్తపల్లి రవి పేర్కొన్నారు.