Breaking News

వృద్ధులకు ఆలన

వృద్ధులకు వైద్య చికిత్సలు అందిస్తున్న సిబ్బంది

సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడగు, శ్రీరాములపల్లిలో వైద్య ఆరోగ్యశాఖ వృద్ధుల కోసం ‘ఆలన’ అనే ఓ ప్రత్యేకకార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు వైద్యసిబ్బంది పరీక్షలు నిర్వహించి.. వారికి అవసరమైన మందులు అందజేశారు. బీపీ, షుగర్​, పక్షవాతం, క్యాన్సర్​తో బాధపడుతున్న వారికి మందులు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో డాక్టర్లు సయ్యద్, అబ్దుల్ రఫె, వైద్యసిబ్బంది శ్రీనివాస్, రమణమూర్తి, సంధ్య, శ్రీలత, రాజేశ్వరి, బూదమ్మ, ఆశాలు మమత, అంజమ్మ, సుజాత శశికళ , వేదిర ఉపసర్పంచ్ సత్యనారాయణ, కారొబార్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.