Breaking News

విదేశాలకు మన వేరుశనగ

  • వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

సారథి న్యూస్​,నాగర్ కర్నూల్​: అద్భుత తెలంగాణ ఆవిష్కరణకు నూతన వ్యవసాయ విధానాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నియంత్రిత సాగు విధానంపై రైతులకు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దశాబ్దకాలం తర్వాత ప్రపంచ వ్యవసాయ చిత్రపటంలో తెలంగాణ ఉంటుందన్నారు. వనపర్తి, నాగర్ కర్నూల్​ జిల్లాలో వేరుశనగ నుంచి మంచి వంగడాలు తీసుకొస్తామన్నారు. పంటను ఇక్కడి నుంచే విదేశాలకు ఎగుమతి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు.

రైతులు మొక్కజొన్న పండించవద్దని, వరిలో సన్నరకాలు పండించాలి సూచించారు. ఈ ఏడాది రాష్ట్రంలో ఆయిల్ పామ్ తోటలను 5 నుంచి 10 లక్షల ఎకరాల్లో పండించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఎట్టిపరిస్థితుల్లోనూ పాలమూరు –రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అన్యాయం జరగనివ్వబోమని, రైతుల కోసం నిలబడతామన్నారు. సమావేశంలో నాగర్​కర్నూల్​ ఎంపీ పోతుగంటి రాములు, జడ్పీ చైర్​పర్సన్​ పెద్దపల్లి పద్మావతి, ప్రభుత్వ విప్ కె.దామోదర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కలెక్టర్​ శ్రీధర్​, మార్కెట్ చైర్మన్ ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.