Breaking News

లోవోల్టేజీ సమస్య పరిష్కరిస్తాం

సారథిన్యూస్, బిజినేపల్లి: లోవోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు కొత్త సబ్​స్టేషన్లను నిర్మిస్తున్నామని నాగర్​కర్నూల్​ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం సమీపంలోని నూతన కేవీ సబ్​స్టేషన్​ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడూతూ.. టీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్​ సమస్య పరిష్కారమైందని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ హరిచరణ్ రెడ్డి , సర్పంచ్ గోవిందు లావణ్య నాగరాజు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కిరణ్, వైస్ ఎంపీపీ చిన్నారెడ్డి , ఎంపీటీసీలు తిరుపతి రెడ్డి, నాయకులు శేఖర్ రావు, మహేష్ రావు తదితరులు పాల్గొన్నారు