Breaking News

రోడ్డంతా గుంతలమయం

సారథి న్యూస్, చొప్పదండి: గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో కరీంనగర్​ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్​ గ్రమాంలోని శివారుప్రాంతం నుంచి సాంబయ్యపల్లి వెళ్లే కమాన్​వరకు తారు రోడ్డు లేకపోవడంతో మట్టిరోడ్డు గుంతలుగా మారింది. గాయత్రి పంప్ హౌస్ నిర్మాణం కోసం నిత్యం కంకర సరఫరా చేసే లారీలతో రద్దీగా మారడంతో రోడ్డంతా గుంతల మయం అయింది. దీంతో ఎప్పుడ ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. గతంలోనూ ఈ రోడ్డుపై అనేకప్రమాదాలు జరిగాయి. అధికారులు దృష్టిసారించి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.