Breaking News

రైతుల ఖాతాల్లోకి మళ్లీ రూ.2,000

రైతుల ఖాతాల్లోకి మళ్లీ రూ.2,000

అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త

ఆగస్టు 1 నుంచి ‘కిసాన్ సమ్మాన్ నిధి’ డబ్బులు

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం రైతులకు మరోసారి తీపికబురు చెప్పింది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ద్వారా అందిస్తున్న డబ్బును మళ్లీ రైతుల బ్యాంక్ అకౌంట్లలో వేయనుంది. ఆగస్టు 1 నుంచి రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.రెండు జమ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రధాని మోడీ సర్కారు రైతుల కోసం ప్రవేశపెట్టిన కిసాన్​సమ్మాన్ నిధి స్కీం ద్వారా వారికి ఏడాదికి రూ.ఆరువేలు అందిస్తోంది. మూడు దఫాలుగా రూ.రెండువేల చొప్పున రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు పడిపోతాయి. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఆరో విడత డబ్బును జమచేయనున్నారు. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో.. లేదో తెలుసుకోవాలంటే పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ PMKISAN ఓపెన్ చేసి.. ఆధార్ వివరాలను ఎంటర్​ చేసి డిటెయిల్స్​తెలుసుకోవచ్చు.