చెన్నై: కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో మోసగాళ్ల రెచ్చిపోతున్నారు. కరోనాకు మందు కనిపెట్టామంటూ ఇటీవల ఓ ప్రముఖ కంపెనీ ప్రకటించి.. ఆ తరువాత తూచ్ అంటూ నాలుక కరుచుకున్నది. తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఓ స్వీట్ షాప్ ఇదే తరహా మోసానికి పాల్పడింది. తమ దుకాణంలో తయారుచేసే మైసూర్ పిక్ తిని కరోనాను నయం చేసుకోవచ్చని ప్రచారం మొదలుపెట్టింది. అంతేకాక రూ.800 కిలో చొప్పున ఆ స్వీట్ను అమాయకులకు అంటగట్టింది. ఈ మైసూర్పాక్లో 19 రకాల హెర్చల్ పదార్థాలను వాడుతున్నామంటూ మోసానికి పాల్పడింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ ( ఫుడ్ సెఫ్టీ అండ్ స్టాండర్డ్స అథారిటీ ఆఫ్ ఇండియా) ఆ దుకాణంలో తనిఖీలు చేసి దుకాణం లైసెన్స్ను రద్దు చేసింది. కరోనాను నయం చేస్తామంటూ కొందరు చేస్తున్న తప్పడు ప్రచారాలను నమ్మొద్దని అధికారులు సూచిస్తున్నారు.