సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాను అన్ని రంగాల్లో ముందు నిలిపేందుకు ప్రజలు, అధికారులు, నాయకుల సహకారంతో కృషిచేస్తానని కలెక్టర్ఎం.హనుమంతరావు ప్రకటించారు. సోమవారం మెదక్ జిల్లా కలెక్టర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు పాపన్నపేట మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవాని మాతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏడుపాయలలో ఆలయ ఈవో శ్రీనివాస్కలెక్టర్కు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. దుర్గామాతకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. వనదుర్గామాత అమ్మవారు ఎంతో మహిమాన్వితమైనదని.. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించే ముందు దుర్గామాతను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆలయ ఈవోతో పాటు పూజారులు, సిబ్బంది శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.
- October 26, 2020
- Archive
- Top News
- EDUPAYALA
- HANUMANTHARAO
- medak
- SIDDIPETA
- VANADURGAMATHA
- ఏడుపాయల
- మెదక్
- వనదుర్గమాత
- సిద్దపేట
- హనుమంతరావు
- Comments Off on మెదక్ కలెక్టర్గా ఎం.హనుమంతరావు బాధ్యతల స్వీకరణ