![మానోపాడులో కొత్తకేసులు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/CARONA-NEW-CASESES-WEDNUSDAYFF.jpg?fit=1280%2C720&ssl=1)
సారథి న్యూస్, మానవపాడు: కరోనా కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ దివ్య సూచించారు. మానోపాడు పీహెచ్సీ పరిధిలో 75 మందికి పరీక్షలు నిర్వహించగా 21 కేసులు బయటపడ్డాయని చెప్పారు. కాబట్టి ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జలుబు, దగ్గు , ఆయాసం, జ్వరం ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.