![మాజీ ఓపెనర్ చేతన్ చౌహాన్ కన్నుమూత](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/CHETAN-2FF.jpg?fit=677%2C465&ssl=1)
ఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్ చేతన్ చౌహాన్ (73) కరోనాతో పోరాడుతూ ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని అతని సోదరుడు పుష్పేంద్ర చౌహాన్ మీడియాకు వెల్లడించారు. జులై 12న కరోనా వైరస్ బారిన పడడంతో అతని మొదట లఖ్నౌవూలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. ఆరోగ్యం మరింత క్షీణిస్తుండడంతో గురుగ్రామ్లోని మరో ఆస్పత్రికి తరలించారు. అతని కిడ్నీతో సహా కొన్ని అవయవాలు పాడవడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో అతణ్ని వెంటిలేటర్పై ఉంచారు. ఈ క్రమంలో చేతన్ చౌహాన్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. తన కెరీర్లో భారత్ తరఫున చేతన్ చౌహాన్ 40 టెస్టులు, ఏడు వన్డేలు ఆడారు.