Breaking News

మాజీ ఓపెనర్​ చేతన్ చౌహాన్‌ కన్నుమూత

మాజీ ఓపెనర్​ చేతన్ చౌహాన్‌ కన్నుమూత

ఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్‌ చేతన్‌ చౌహాన్ (73)‌ కరోనాతో పోరాడుతూ ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని అతని సోదరుడు పుష్పేంద్ర చౌహాన్ మీడియాకు వెల్లడించారు. జులై 12న కరోనా వైరస్‌ బారిన పడడంతో అతని మొదట లఖ్‌నౌవూలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. ఆరోగ్యం మరింత క్షీణిస్తుండడంతో గురుగ్రామ్‌లోని మరో ఆస్పత్రికి తరలించారు. అతని కిడ్నీతో సహా కొన్ని అవయవాలు పాడవడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో అతణ్ని వెంటిలేటర్‌పై ఉంచారు. ఈ క్రమంలో చేతన్‌ చౌహాన్‌ ఆదివారం తుదిశ్వాస విడిచారు. తన కెరీర్‌లో భారత్‌ తరఫున చేతన్‌ చౌహాన్‌ 40 టెస్టులు, ఏడు వన్డేలు ఆడారు.