Breaking News

బ్లాస్టింగ్​ నిర్వహించొద్దు

బ్లాస్టింగ్ నిర్వహించొద్దు

సారథి న్యూస్​, మునగాల: క్రషర్​ మిల్లులో రాత్రి వేళ నిర్వహిస్తున్న బ్లాసింగ్​లు ఆపాలంటూ స్థానికులు ధర్నాకు దిగారు. వివరాల్లోకి వెళితే..సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం గ్రామ శివారులో ఉన్న క్రషర్​ మిల్లులో యాజమాన్యం తరచూ రాత్రి వేళ పెద్ద ఎత్తన బ్లాస్టింగ్​లు జరుపుతున్నారు. దీంతో స్థానిక ఎస్సీ కాలనీలో నివాసముంటున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం క్రషర్ మిల్లు యాజమాన్యం బ్లాసింగ్​లు ఆపాలంటూ వారు రోడ్డుపై ధర్నాకు దిగారు. కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారులు చర్యలు తీసుకోవాలంటూ వారు కోరారు. పోలీసులు ధర్నా జరిగిన ప్రాంతానికి చేరుకుని యాజమాన్యంతో మాట్లాడి శబ్దాలు రాకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.