న్యూఢిల్లీ: జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడేందుకు విండీస్ క్రికెట్ జట్టు కూడా సమాయత్తమైంది. ఈ మేరకు ఇంగ్లండ్తో జరిగే మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ‘బ్లాక్ లైవ్ మ్యాటర్స్’ లోగోతో బరిలోకి దిగనుంది. దీనికి ఐసీసీ కూడా ఆమోదం తెలిపింది. విండీస్ క్రికెటర్లు ధరించే జెర్సీల కాలర్పై దీనిని ప్రత్యేకంగా ముద్రించనున్నారు. ప్రముఖ డిజైనర్ అలీషా హోసన్నా ఈ లోగోను రూపొందించింది. ఇప్పటికే ప్రీమియర్ లీగ్కు చెందిన 20 ఫుట్బాల్ క్లబ్స్ ఈ లోగోను ధరించి జాతి వివక్షకు వ్యతిరేకంగా తమ మద్దత తెలుపుతున్నాయి. ‘ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుందో మాకు అవగాహన ఉంది. ప్రతిఒక్కరూ సమానత్వం, సమన్యాయం అనే అంశాలపై పోరాటం చేస్తున్నారు. విండీస్ క్రికెటర్లుగా మా చరిత్ర ఏమిటో మాకు తెలుసు. భవిష్యత్ తరాలకు మేం మార్గదర్శకులుగా ఉండాలనుకుంటున్నాం. అందుకే ఏ నిర్ణయాన్ని మేం తేలికగా తీసుకోవడం లేదు. వివక్షపై మాట్లాడేవారికి ఇదేలా ఉంటుందో తెలుసు. అందరిలో ఐక్యత, సమన్యాయం వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది’ అని విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ పేర్కొన్నాడు.
- June 30, 2020
- Archive
- Top News
- క్రీడలు
- BLACKLIVE MATTERS
- FOOTBALL CLUB
- WESTINDIES
- బ్లాక్ లైవ్ మ్యాటర్స్
- వెస్టిండీస్
- హోల్డర్
- Comments Off on బ్లాక్ లైవ్ మ్యాటర్స్ లోగోతో బరిలోకి