![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/KANGANA-COMMENTSFF.jpg?fit=700%2C393&ssl=1)
బాలీవుడ్లో ప్రముఖులుగా చలామణి అవుతున్నవారంతా డ్రగ్స్కు బానిసలేనంటూ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు చేశారు. ‘నాకు తెలిసిన ఓ స్టార్ హీరో నిత్యం డ్రగ్స్లో మునిగితెలేవాడు. ఓ సారి మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకున్నాడు. ఆ సమయంలో నేను అతడితో డేటింగ్లో ఉన్నాను. డ్రగ్స్ తీసుకొని అతడు సైకోలా ప్రవర్తించేవాడు. అతడి టార్చర్ భరించలేక భార్యకు కూడా వదిలేసింది’అంటూ ఆమె పేర్కొన్నారు. ఇటీవల కంగనా ఓ టీవీ చానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్లోని హీరోలు, హీరోయిన్స్ మాత్రమే కాదు. మిగతా సిబ్బంది కూడా డ్రగ్స్ తీసుకుంటారని చెప్పారు. దాదాపు 90 శాతం మంది ఇక్కడ డ్రగ్స్కు బానిసలు అంటూ ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వాలు వెంటనే కల్పించుకొని డ్రగ్స్ను సరఫరా చేసేవారిని పట్టుకుంటే పెద్దపెద్ద వాళ్లంతా లోపలికి వెళ్తారని చెప్పారు.