![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/CONGRESS-PRESSMEETFF.jpg?fit=729%2C330&ssl=1)
సారథిన్యూస్, రామడుగు: చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ టీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ బీసీసెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు బహిరంగ సవాల్ విసిరారు. బుధవారం ఆయన కరీంనగర్ జిల్లా రామడుగులో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పనితీరు అధ్వాన్నంగా ఉన్నదని ఆరోపించారు. కాంగ్రెస్ కమిషన్ల పార్టీ అని టీఆర్ఎస్ నేతలు విమర్శించడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు. కాంగ్రెస్ కమిషన్ల పార్టీ అయితే ఆ పార్టీ నేతలను చేర్చుకుంటున్న టీఆర్ఎస్ది కూడా కమిషన్ల పార్టియే కదా అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మరవేణి తిరుపతి ముదిరాజ్, వన్నారం ఎంపీటీసీ జవ్వాజి హరీశ్, నాయకులు బాపిరాజు, అసిఫ్, జక్కుల బాబు, కట్ల శంకర్, కర్నె శ్రీను, ఎలికొండ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.