Breaking News

ప్రజాసమస్యలపై పోరాడుదాం

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట బీజేపీ మండల కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. బీజేపీ మండల అధ్యక్షుడిగా మంగళి యాదగిరి, ప్రధానకార్యదర్శులుగా నరేందర్, దశరథ్, ఉపాధ్యక్షులుగా పెంటా గౌడ్, మేడి స్వామి, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ, గోపాల్, కార్యదర్శులుగా వడ్ల సిద్ధిరాములు, సంతోశ్​రెడ్డి, సురేశ్​, కోశాధికారిగా బాలసుబ్రమణ్యం, యువ మోర్చా అధ్యక్షుడిగా మహేశ్​, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా వెంకటేశ్​, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా మూర్తి శంకర్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా డప్పు స్వామి, మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా ఎండీ సయ్యద్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా ధరావత్ నరేశ్​, పట్టణ అధ్యక్షుడిగా ఆకుల రాజు ఎన్నికయ్యారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా దత్తు ప్రకాశ్​ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ శ్రేణుల ప్రజాసమస్యలపై పోరాటాలు చేసి.. పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.