Breaking News

ప్రజాధనం దుర్వినియోగం

సారథి న్యూస్​, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని లక్ష్మీనగర్​లో 2013లో ప్రభుత్వం నిర్మించిన షాపింగ్​ కాంప్లెక్స్​ నిరుపయోగంగా ఉందని.. దీంతో రూ. 7 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నదని సీపీఐ నేతలు ఆరోపించారు. ఆదివారం సీపీఐ నేతలు రామగుండంలో పర్యటించి ప్రభుత్వం నిర్మించిన షాపింగ్​ కాంప్లెక్స్​ను సందర్శించారు. సీపీఐ రామగుండం నగర కార్యదర్శి కనకరాజ్​ మాట్లాడుతూ.. కేవలం కాంట్రాక్టర్లను బతికించడానికే షాపింగ్​ కాంప్లెక్స్​ను నిర్మించారని ఆరోపించారు. ఈ దుకాణ సముదాయం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే టెండర్లు పిలిచి అర్హులకు షాపులను కేటాయించాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు మద్దెల దినేశ్​, తలపల్లి మల్లయ్య, టీ రమేశ్​కుమార్, వై లెనిన్, రేణికుంట్ల ప్రీతం, తలపల్లి సురేంద్ర, వనపాకల విజయ్, కే అవినాష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.