Breaking News

పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దాలి

సారథి న్యూస్, వెల్దండ: వెల్దండ మేజర్​ పంచాయతీని ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దాలని నాగర్​ కర్నూల్​ జిల్లా కలెక్టర్​ ఎల్​.శ్రీధర్​ ప్రజాప్రతినిధులు, అధికారులను కోరారు. గురువారం ఆయన వెల్దండ మండల కేంద్రంలోని నర్సరీని పరిశీలించారు. పక్కాగా పల్లె ప్రగతి పనులు చేపట్టాలని ఆదేశించారు. వానాకాలంలో నాటేందుకు హరితహారం మొక్కలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను కలెక్టర్​ పరిశీలించి బాగా జరుగుతున్నాయని కితాబిచ్చారు. కలెక్టర్​ వెంట స్థానిక సర్పంచ్​ యెన్నం భూపతిరెడ్డి, డీపీవో సురేష్​ మోహన్​, ఆర్డీవో రాజేష్​కుమార్​, ఎంపీపీ విజయజైపాల్, ఏపీడీ గోవిందరాజులు, చారకొండ ఎంపీడీవో జయసుధ, కార్యదర్శి వికాస్​ ఉన్నారు.